Saturday 31 January 2015

దక్షిణ భారతంలో కూడా బిజెపి పాగా వేయనుందా...!!



దక్షిణ భారత దేశంలో కీలక పాత్ర పోషించటానికి భారతీయ జనతా పార్టీ  (బిజెపి) పావులు కలుపుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే బిజెపి స్థానిక నాయకులు కూడా ఇందుకు కొన్ని ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ మధ్యే తెలంగాణ రాష్ట్రం లో పర్యటించిన అమిత్ షా ప్రతి నెలకొకసారి దక్షిన భారతదేశం లో.., ప్రతి మూడు నెలల కొకసారి తెలంగాణా లో పర్యటిస్తానని చెప్పారు. ఉత్తర భారత దేశంలో మోడీ సహకారం తో  పార్టీ ని ఒంటి చేత్తో నడిపించి స్థానిక పార్టీల కోటలను బద్దలు కొట్టి మరీ.., ఘన విజయం సాధించి పెట్టిన  అమిత్ షా ఇప్పుడు దక్షిణ భారతంలో పార్టీ బలోపేతం పై ద్రుష్టి పెడుతున్నారని సమాచారం.

అమిత్ షా ఈ ప్రాంతంలో ఎలా అయిన బిజెపి ని అధికారం లోకి తీసుకురావాలని కనీసం అధికారం లోకి రాని చోట మన ఉనికిని చాటి చెప్పాలని.., మెల్లిగా మన ప్రాబల్యాన్ని విస్తరించాలని స్థానిక బిజెపి నాయకులకు హిత బోధ చేసి మరీ వెళ్లారు. దానికి ఉదాహరణగా మహారాష్ట్ర ను చూపిస్తున్నారు. గత సంవత్సర కాలంగా కార్యకర్తలు తీవ్రంగా శ్రమించి ప్రతి ప్రాంత ప్రజల్లోకి పార్టీ ని తీసుకెళ్ళారు. దాని వల్లే మహారాష్ట్ర లో విజయం సాధించామని చెప్పుకోచ్చారు. కనుక దక్షిణ భారత దేశం లో పార్టీ ని బల పర్చాతనికి ప్రతి ఒక్కరు కష్ట పడాలని, ఏవైనా ఆంతర్గిక గ్రూప్ తగాదాలు ఉంటె అవన్నీ పరిష్కరించుకొని పార్టీ కోసం కష్ట పడాలను సూచించి మరీ వెళ్లారు. ప్రతి రాష్ట్రములో పార్టీ పనితీరును పరిశీలించటానికి అమిత్ షా ఒక రహస్య పరిశీలకుడిని నియమించినట్లు సమాచారం. ఆ పరిశీలకుడు ఎప్పటికప్పుడు పార్టీ పని తీరుపై బిజెపి అధిష్టానానికి నివేదికలు కూడా పంపుతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా త్వరలో జరగనున్న తమిళ నాడు ఎన్నికలకు బిజెపి పార్టీ అత్యధిక ప్రాముఖ్యత ని ఇస్తున్నట్లు తెలుస్తుంది.

అందులో భాగంగానే తమిళ నాడు లోని ఒక పేరు మోసిన సినీ ప్రముఖుడిని బిజెపి లోకి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు కాని ఆ నటుడు అందుకు అంగీకరించక పోవటం తో.., స్వయంగా మోడీ కూడా ఆ సుప్రసిద్ధ నటుడిని సంప్రదించినప్పటికీ.., ఆ తమిళుల ఆరాధ్య నటుడు సున్నితంగా తిరస్కరించినట్లు అక్కడి పార్టీ స్థానిక నేతలు చెప్తున్నారు. కాని ఎన్నికల సమయం వరకు ఏ అద్భుతమైన జరిగి ఆ నటుడు మనసు మార్చుకొని మోడీ ప్రయత్నం తో, అమిత్ షా సంప్రదింపులతో అప్పటివరకు రావచ్చేమో అని స్థానిక బిజెపి నాయకులు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇంకో తమిళ నటుడు విజయ్ మోడీ కి మద్దతుగా ఢిల్లీ కి వెళ్లి కలిసి వచ్చారు కాని ఆయన ప్రత్యేకంగా పార్టీ పెట్టె ఆలోచన చేసినప్పటికీ ఆయన సన్నిహితులు కొంత మంది వద్దని అనటంతో అప్పటికి ఆ ఆలోచన విరమించుకొని బిజెపికే  మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెల్సుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో సుప్రసిద్ధ నటుడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టాక కూడా బిజెపి తరపున మద్దతుగా నిలిచి ప్రచారంలో పాలు పంచుకున్నారు. అక్కడ ఆంద్ర ప్రదేశ్ లో ఆ ఫార్ములా సక్సెస్ కావటం తో తమిళ నాడు లో కూడా అదే విజయ సూత్రాన్ని అనుసరించ బోతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే బిజెపి లోకి ఒక సినీ ప్రముఖుడిని సంప్రదించి తమ పార్టీ లోకి రావాలని ఆహ్వానించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ను బిజెపి ఆకర్షించగలిగింది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సమక్షం లో ఈయన పార్టీలో చేరబోతున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే తమిళ నాడు ఇన్ ఛార్జ్ గా ఉన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అమరన్ మాట్లాడారు. ఈయన చేరిక పార్టీ కి కొంత లబ్ది చేకూరే అవకాశం ఉందని తమిళ నాడు బిజెపి వర్గాల అంచనా.

తమిళ నాడులో ఉన్న ప్రముఖులపై దృష్టి పెట్టి బిజెపి తమ పార్టీ లోకి ఆకర్షించాలని భావిస్తుందని తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్క ప్రముఖుడికి వర్తమానం పంపి పార్టీ ప్రచారం లో పాలు పంచుకునేలా చేయటానికి బిజెపి తరపున ప్రధాన కార్యదర్శి మురళిధర రావు పై ఈ బాధ్యత ని పెట్టారని  పార్టీ వర్గాలు చెప్తున్నాయి  ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క అంశం పై  ద్రుష్టి పెట్టి పార్టీ దక్షిణం నలు దిశల వ్యాపింప జేయాలని అమిత్ షా యోచిస్తున్నట్లు ఇది అమిత్ షా ఆలోచన్ మాత్రమే కాదని దీనికి ముందే మోడీ కూడా అమిత్ షా కు కొన్ని మార్గ దర్శకత్వాలు ముందే ఇచ్చారని అందుకే అమిత్ షా పార్టీ బలోపేతం పై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

హరికాంత్

No comments:

Post a Comment