Monday 7 September 2015

భారత గడ్డ భారతీయుల కోసం.... 'బయటి' వారి కోసం కానే కాదు....!!


భారత దేశం భిన్న సంస్కృతుల దేశం.., విభిన్న వర్గాలతో అనునిత్యం ప్రశాంతతే పరమావధిగా దేశం విరాజిల్లుతుంది... కొన్ని కొన్ని సార్లు స్వల్ప చేదు సంఘటనలు మినహా దేశం ఎప్పుడు ప్రశాంతతే కోరుకుంటూ వచ్చింది.... అది ముమ్మాటికి భారతీయుల గొప్పతనం. భారత దేశ ప్రజలు శాంతి కాముకులని ప్రపంచానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని హింసించి పరిపాలించిన బ్రిటిష్ వాడి పైనే మనం చేయేత్తలేదు. శాంతికి అసలైన వారసుడు గాంధి నేతృత్వంలో ఎంతో ఓపికతో స్వతంత్రాన్ని సాధించుకున్న భారతీయులం మనం...

ఇంత గొప్ప చరిత్ర కలిగి ఉన్న మనకు.. ఇప్పుడు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మొత్తం తమ పాలన విధానాలతో దేశ ప్రజల స్థితి గతుల పైనే ప్రభావం చూపిస్తున్నాయేమో అన్న భావం కలిగేలా వ్యవహరిస్తున్నాయి. కొన్ని సార్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజల అస్థిత్వాన్నే ప్రశ్నిస్తున్నాయి....

నైజీరియన్లు.... ఇప్పుడు భారత దేశంలో పాతుకుపోయిన ఒక వలస వర్గం... దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో చదువు పేరుతో, వివిధ పనుల పేరుతో దేశంలో ఎన్నో అరాచక పనులు చేపడుతున్న ఈ దేశస్తులు ఇప్పుడు దేశంలోని కొన్ని ప్రాంతాలలో రాజ్యమేలుతున్నారు... మొన్నటికి మొన్న దేశంలో ఎంతో పేరు కలిగిన ఒక ఐపిఎస్ అధికారి పేరు వాడుకొని లక్షల్లో మోసం చేశారు... ఏ దినపత్రిక చూసిన.., ఏ టి వి ఛానల్ పెట్టినా కాని.., వారే వారానికోసారి నైజీరియన్లు వార్తల్లో నిలవటం గమనార్హం. కొన్ని నెలల క్రితం ఏదో కేసుపై నైజీరియన్ల ముఠాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువస్తే మొత్తం అక్కడి పోలీస్ స్టేషన్ లో.., పోలీస్ లనే హడలెత్తించిన ఘన చరిత్ర నైజీరియన్ల సొంతం.  

డ్రగ్స్ అనే మహమ్మారిని వారు అంటించుకుంటూ.., మన దేశ ప్రజలకు ఆ మహమ్మారిని వ్యాపింప జేస్తూ దేశ ప్రజల జీవన విధానాన్నే మార్చేస్తూ దేశ పోలీస్ వ్యవస్థకే సవాలు విసురుతున్నారు. దేశంలో ఏ  ప్రధాన సైబర్ నేరం జరిగిన కాని.., ఆ నేరానికి సంబంధించిన పునాదులు మల్లి నైజీరియన్ల వద్దే ఉండటం నిజంగా శోచనీయం... డ్రగ్స్ తో, దొంగతనాలు దోపిడీలతో, సైబర్ నేరాలతో, అసాంఘిక కార్యకలాపాలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న నైజీరియన్ల వల్ల మరి దేశానికి నిజంగానే ఉపయోగం ఉందా అంటే.., ఆ విషయం మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకే తెలియాలి. ఎందుకంటే దేశంలోని కొన్ని వర్గాలు తమ ప్రాంతం ఇదని, తమ బాష ఇదని, తమ మతం ఇదని..,ఎన్నో ప్రాంతీయ ఉద్యమాలు, ఎన్నో పోరు ఉద్యమాలు జరిగాయి.., జరుగుతున్నాయి. కాని మన దేశంలోకి ఎవడో వచ్చి మన దేశ ప్రజల జీవన విధానాన్నే దెబ్బ కొడుతున్న ఇతర దేశాల అరాచక శక్తులపై మాత్రం మన దేశ ప్రజలు మాత్రం ఇది మా దేశమని వారికి మన గొంతు వినిపించకపోవటం నిజంగా మన దురదృష్టం. 

అసలు నైజీరియన్ల మరియు మిగతా ఇతర వివాదాస్పద దేశాల ప్రజల వీసాలను జారి చేసి వారిని అనుమతించటం ద్వారా.., మనకు ఆర్థికంగా కాని ఏ ఇతర విషయాల ద్వారా కాని, ఏ రకంగా చూసుకున్నా మన దేశానికి, మన దేశ ప్రజలకు నష్టమే తప్పితే కించిత్తు లాభం కూడా లేదు.... వారి వీసాలను అనుమతించటం ద్వారా.., మన విశ్వవిద్యాలయాల్లో చదువుకోవటానికి అనుమతించటం ద్వారా మన ఆర్ధిక వ్యవస్థకు ఎంత లాభం ఉందో తెలియదు కాని.., వారు ఇక్కడకి వచ్చి చేసే పనుల వల్ల మాత్రం మన దేశానికి, దేశ ప్రజలకి రెట్టింపుకి రెట్టింపు  నష్టం ఉందన్నది జగమెరిగిన సత్యం.

ప్రపంచంలోని చాలా దేశాలు తమ విదేశీ వ్యవహారాల విధానాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి.., కొన్ని వివాదాస్పద దేశాల ప్రజలకు వీసా కాదు కదా తమ దేశం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా వ్యవహరిస్తున్న తీరుని మన భారత దేశం ఎందుకు గమనించటం లేదన్నది దేశ ప్రజలకి బొత్తిగా అర్థం కావటం లేదు. ఇప్పటికైనా మన విదేశాంగ విధానాలనే సమూలంగా మార్చి సంస్కరణల దిశగా అడుగులు వేస్తే దేశానికి, దేశ రక్షణకి., పాలకులు ఎంతో మేలు చేసిన వారవుతారు. 

హరికాంత్ రెడ్డి రామిడి 

No comments:

Post a Comment